రైల్వేల్లోని 8 సర్వీసులను విలీనంచేసి ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ (IRMS) ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రైల్వేల్లో ఉద్యోగాలు కోరేవారు ఇకపై యూపీఎస్సీ అభ్యర్థుల మాదిరిగానే ప్రిలిమ్స్ పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుది. ఆ తర్వాత వీరు టెక్నికల్ (సివిల్, మెకానికల్, టెలికామ్, ఎలక్ట్రికల్); నాన్టెక్నికల్ (పర్సనల్, ట్రాఫిక్) స్పెషాలిటీల్లో ఒకదాన్ని ఎంచుకొని.. ‘IRMS’ పరీక్ష రాయాల్సి ఉంటుంది.